విశాఖ జీఐఎస్‌ రెండో రోజు: ఏపీ సర్కార్‌ కీలక ఎంవోయూలు.. ఏ సంస్థ ఎంత పెట్టుబడి అంటే..?

4 Mar, 2023 11:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం.. పరిపాలన రాజధాని విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 విజయవంతమైంది. సదస్సులో రెండో రోజైన శనివారం(మార్చి 4వ తేదీ) ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో.. రిలయన్స్‌ కంపెనీ 50వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా(ఇవాళ్టి ఒప్పందాల ప్రకారం) ఉంది.

విశాఖ జీఐఎస్‌.. రెండోరోజు ఎంవోయూల జాబితా పరిశీలిస్తే..
►రిలయన్స్‌ ఎంవోయూ రూ. 50,000 కోట్లు

►హెచ్‌పీసీఎల్‌ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్లు

►టీవీఎస్‌ ఐఎల్‌పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు

►ఎకో స్టీల్‌ ఎంవోయూ రూ. 894 కోట్లు

►బ్లూస్టార్‌ ఎంవోయూ రూ. 890 కోట్లు

►ఎస్‌2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ రూ. 850 కోట్లు

►గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు

►ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు

►రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు

►క్రిబ్కో గ్రీన్‌ ఎంవోయూ రూ. 725 కోట్లు

►ప్రకాశ్‌ ఫెరోస్‌ ఎంవోయూ రూ. 723 కోట్లు

►ప్రతిష్ట బిజినెస్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

►తాజ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

►కింబర్లీ క్లార్క్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

►అలియన్న్‌ టైర్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 679 ‍కోట్లు

►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు

►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు

►డీఎక్స్‌ఎన్‌ ఎంవోయూ రూ. 600 కోట్లు

►ఈ-ప్యాక్‌ డ్యూరబుల్‌ ఎంవోయూ రూ. 550 కోట్లు

►నాట్‌ సొల్యూషన్న్‌ ఎంవోయూ రూ. 500 కోట్లు

►అకౌంటిఫై ఇంక్‌ ఎంవోయూ రూ. 488 కోట్లు

►కాంటినెంటల్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు

►నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు

►ఆటమ్‌స్టేట్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

►క్లేరియన్‌ సర్వీసెస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

►చాంపియన్‌ లగ్జరీ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

►వీఆర్‌ఎమ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 342 కోట్లు

►రివర్‌ బే గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►హావెల్స్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు

►సూట్స్‌ కేర్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు

►పోలో టవర్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►ఇండియా అసిస్ట్‌ ఇన్‌సైట్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►స్పార్క్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►టెక్‌ విషెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►మిస్టిక్‌ పామ్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►నియోలింక్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు

►అబ్సింకా హోటల్స్‌ ఎంవోయూ రూ. 260 కోట్లు

►సర్‌ రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

►హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూరూ. 250 కోట్లు

►చాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

►టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు

►ఎకో అజైల్‌ రిసార్ట్‌ ఎంవోయూ రూ. 243 కోట్లు

►ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు

►హైథియన్‌ హ్యూయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు

►గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు

►ఎస్‌పీఎస్‌ ఇన్‌ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు

►డీవీవీ బయో ఫ్యూయల్స్‌ ఎంవోయూ రూ. 223 కోట్లు

►దాల్వకోట్‌ బయో ఫ్యూయల్ప్‌ ఎంవోయూ రూ. 200 కోట్లు

►ఆమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎంవోయూ రూ. 200 కోట్లు

►కేపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ ఎంవోయూ రూ. 184 కోట్లు

►చాంయిన్‌ యాచ్‌ ఎంవోయూ రూ. 190 కోట్లు

►ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్‌ ఎంవోయూ రూ. 185 కోట్లు

►యాక్సలెంట్‌ ఫార్మా సైన్స్‌ ఎంవోయూ రూ. 176 కోట్లు

►విన్‌విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ ఎంవోయూ రూ. 174 కోట్లు

►ట్రాన్సెండ్‌ రియాలిటీ డెవలప్‌మెంట్‌ ఎంవోయూ రూ. 165 కోట్లు

►చాంపియన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఎంవోయూ రూ. 150 కోట్లు

►స్విచ్‌గేర్‌ ఎంవోయూ రూ. 150 కోట్లు

►ఆంబర్‌ ఎంటర్‌ప్రైజస్‌ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు

►ది రిప్పుల్స్‌ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి.

ఇక విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ వేదికగా తొలి రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదిరాయి. మొత్తం 92 ఎంవోయూలు జరిగాయి. వీటి విలువ రూ.11లక్షల 87 వేల 756 కోట్లు. వీటిలో ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమిటెట్‌ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్‌ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్‌ (రూ. 76, 033 కోట్లు), ఏసీఎమ్‌ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్‌ఓఎల్‌ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్‌(రూ. 50, 632 కోట్లు), హంచ్‌ వెంచర్స్‌(రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్‌( రూ 50 వేల కోట్లు) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. 

ఇక రెండు రోజుల ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్‌ చేసిన ప్రకటన.. కార్యరూపం దాల్చినట్లయ్యింది. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ  ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

మరిన్ని వార్తలు