విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు

6 Dec, 2022 18:02 IST|Sakshi

విశాఖ: నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్న నేవీ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ కూడా నేవీ వేడుకల్ని తిలకించారు.

నేవీ డేలో యుద్ధ నౌకలు, విమానాలు అలరించాయి.. ప్రధానంగా మిగ్‌-19 యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఆదివారం సాయంత్రం వేళ విశాఖ సాగర తీరంలో భారత్‌ నేవీ ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఔరా అనిపించాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు