Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా..

4 Mar, 2023 14:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి.

శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా..

ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు

ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు

ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు

పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు

వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు

పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు

జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు.
చదవండివిశాఖ జీఐఎస్‌ సూపర్‌ సక్సెస్‌.. ఇండస్ట్రీస్‌ మ్యాప్‌లో ఏపీ సుప్రీం

మరిన్ని వార్తలు