Vizag Steel Plant: నీతి ఆయోగ్‌ సీఈఓకు నిరసన సెగ

19 Aug, 2021 10:34 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ బస చేసిన హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఈ పోరాటాన్ని చేపట్టారు. ‘సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌’ అంటూ నినదించారు. నీతి ఆయోగ్‌ సీఈఓ గో బ్యాక్‌ అనే నినాదాలతో హోరెత్తించారు. సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం మెడ్‌టెక్ జోన్‌లో పర్యటించనున్నారు.


 

చదవండి: Afghanistan: ఆమె భయపడినంతా అయింది!

మరిన్ని వార్తలు