‘విశాఖ అభివృద్ధిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోంది’

31 Jul, 2021 12:57 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అభివృద్ధిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వెలగపూడి రామకృష్ణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌పై సూచనలు ప్రభుత్వానికి తెలపాలన్నారు. విశాఖపట్నంలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా టీడీపీ అడ్డుకుందని అక్కరమాని దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తలు