బురదచల్లడం మానుకోండి: రామోజీపై వలంటీర్ల ఆగ్రహం

17 Dec, 2022 05:58 IST|Sakshi
గుర్రంకొండలో నిరసన తెలుపుతున్న వలంటీర్లు

శంఖవరం, గుర్రంకొండలో వలంటీర్ల నిరసన

ఈనాడు ప్రతులు, రామోజీరావు దిష్టిబొమ్మలు దహనం

శంఖవరం/గుర్రంకొండ: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ నిస్వార్థంగా సేవలంది­స్తు­న్న తమపై బురదచల్లడం మానుకోవాలని ఈనాడు పత్రిక, రామోజీరావుపై పలువురు వలంటీర్లు ఆగ్ర­హం వ్యక్తంచేశారు. వలంటీర్‌లపై ‘ఈనాడు’లో వచ్చిన అసత్య కథనాన్ని ఖండిస్తూ శుక్రవారం కాకినాడ జిల్లా శంఖవరం, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈనాడు దినపత్రిక ప్రతులు, రామో­జీరావు దిష్టిబొమ్మలను వలంటీర్లు దహనం చేశారు. వలంటీర్లు మాట్లాడుతూ ‘ఈనాడులో ప్రచు­రించినట్లుగా మేం వేగులం కాదు... ప్రజాసేవ­కు­లం. అవినీతికి తావులేకుండా అద్భుతంగా పనిచే­స్తున్న వలంటీర్‌ వ్యవస్థపై ప్రజల్లో అపోహలు సృష్టించడానికి రాజకీయ కోణంలో దుష్ప్రచారం చేయ­డం దారుణం. ఇప్పటికైనా వాస్తవాలను ప్రచురించాలి’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు