సచివాలయ వాచ్‌మన్‌.. నేడు ఊరికి సర్పంచ్‌

17 Feb, 2021 04:43 IST|Sakshi
గుంటూరు ఏసోబు

సాక్షి, పొదిలిరూరల్‌: నిన్నటి దాకా సచివాలయం దగ్గర కాపలా ఉండే వాచ్‌మన్‌.. నేడు సర్పంచ్‌ అయ్యాడు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపా డుకు చెందిన గుంటూరు ఏసోబు గ్రామ సచివాలయం దగ్గర వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. ఈ నెల 13న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్‌ కావడంతో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో ఎన్నికల బరిలో దిగాడు. 2,229 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో 232 ఓట్లతో విజయం సాధించాడు.  

మరిన్ని వార్తలు