సాక్షి, జంగారెడ్డిగూడెం : మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం పాము హల్చల్ చేసింది. ఆలయ పరిసరాల్లో పాము తిరిగాడటంతో సిబ్బంది స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకులు చదలవాడ క్రాంతికుమార్కి సమచారం ఇచ్చారు. ఆయన ఇక్కడకు వచ్చి పామును పట్టుకుని జనావాసాలు లేని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.