మహిళ కానిస్టేబుల్‌ మృతి, పలు అనుమానాలు

7 Nov, 2020 13:38 IST|Sakshi

 సాక్షి, విశాఖపట్నం: నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. అదే స్టేషన్‌లో పనిచేస్తున్న భవాని అనే మహిళ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త నాగల సింహాద్రి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవాని 2018లో నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధుల్లోకి చేరింది. భవానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

చదవండి: దారుణం : బిడ్డల గొంతుకోసిన తండ్రి

మరిన్ని వార్తలు