శ్రీకాళహస్తి: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి.. 

12 Dec, 2022 13:58 IST|Sakshi

క్రైమ్‌: మోసాన్ని మోసపోయేదాకా గుర్తించకపోవడం కొందరి ప్రత్యేకత. అలాంటిదే ఈ ఘటన. తిరుపతిలో ఓ మహిళ చేసిన ఘరానా మోసం బయటపడింది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తిని పూర్తిగా దోచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

బస్సులో పరిచయమై లాడ్జికి తీసుకెళ్లింది కిలాడి మహిళ. దీంతో వెళ్లిన అతగాడికి.. ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి దోచుకుంది ఆ మహిళ. సుమారు 75 తులాల బంగారం,20 వేల నగదు, ఓ సెల్ ఫోన్ మాయం చేసి పరారైంది. ఆ విలువ సుమారు రూ. 6లక్షల రూపాయలు అంటున్నాడు బాధితుడు.

బాధితుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు పోలీసులు. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ  కిలేడీ గురించి గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు