తాడేపల్లి: గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎల్లుండి(బుధవారం) సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న వర్క్షాప్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు.