‘తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’

12 Jul, 2021 17:39 IST|Sakshi

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

సాక్షి, అమరావతి: తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.  

మరిన్ని వార్తలు