Viral Marriage In Piler: చిత్తూరు అబ్బాయి, కశ్మీర్‌ అమ్మాయి.. బెర్లిన్‌లో ప్రేమ..

12 Dec, 2021 18:48 IST|Sakshi

సాక్షి, పీలేరు(చిత్తూరు): బెర్లిన్‌లో ప్రేమించుకున్న ప్రేమజంటకు పీలేరులో వివాహం జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన కాకులారం మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి గత మూడేళ్లుగా బెర్లిన్‌లోని చార్టీ రాష్ట్రంలో ఓ సైన్స్‌ పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. అక్కడే కశ్మీర్‌కు చెందిన రూఫ్‌కిషన్‌ రైనా కుమార్తె షికా రైనా కూడా బెర్లిన్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో కుమార్‌రెడ్డి, షికా రైనాలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించడంతో ఆదివారం స్థానిక పీలేరు ఎంఎన్‌ఆర్‌ కల్యాణమండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

చదవండి: (ట్రైనింగ్‌లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్‌ఐల పెళ్లి)

మరిన్ని వార్తలు