Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’!

20 Sep, 2021 09:38 IST|Sakshi

ద్వారకా తిరుమల: అతి చిన్న వయసులోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆ యువతిని పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడేనికి చెందిన 21 ఏళ్ల మానుకొండ షహీల డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆమెకు వివాహమైంది. మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచి.. 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది.  ఆమెను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు అభినందించారు.

మానుకొండ షహీల

మరిన్ని వార్తలు