సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభం

30 Jun, 2021 13:15 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం అయింది. ఈ సమావేశంలో జులై 8న రైతు దినోత్సవం నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. నూతన ఐటీ పాలసీకి ఆమోదం, జగనన్న టౌన్‌షిప్ ప్రోగ్రాంపై చర్చ జరగనుంది. రైతుల కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది.

వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్‌.. జులై 1, 3, 4 తేదీల్లో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

మరిన్ని వార్తలు