ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్​ అభినందనలు

14 Feb, 2022 08:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్‌ అన్నారు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

కాగా పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్‌–04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్లోని ఫస్ట్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు.

చదవండి: పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

మరిన్ని వార్తలు