సహజవనరులే మన సంపద: సీఎం జగన్‌

5 Jun, 2021 14:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘ప్రకృతి.. దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి.భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి.. ఇది మనందరి బాధ్యత’’అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: YS Jagan అద్భుతాలు చేస్తున్నారు 

మరిన్ని వార్తలు