వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర

23 Oct, 2022 08:59 IST|Sakshi

చంద్రగిరి: వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్‌ జగన్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన వికేంద్రీకరణకు మద్దతుగా పలువురు నాయకులు, యువకులు ఈ పాదయాత్ర చేస్తున్నారు. చిత్తూరు నుంచి పాదయాత్రగా బయలుదేరి పూతలపట్టు, నేండ్రగుంట, చంద్రగిరి మీదుగా సాయంత్రానికి తిరుమల శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నారు.

వైఎస్‌ జగన్‌ సేవాదళ్‌ రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు గణేష్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్‌ సుబ్రహ్మణ్యంరెడ్డి తదితరులు శ్రీవారి మెట్టు మార్గం వద్ద వారికి మద్దతు తెలిపారు. సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం ప్రకారం వికేంద్రీకరణ మన రాష్ట్రానికి చాలా అవసరమని, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే అందరికీ మేలు కలుగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే

మరిన్ని వార్తలు