స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

15 Aug, 2020 08:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!' అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు