కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ

13 Sep, 2021 14:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌కి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం తెలిపారు.

ఇవీ చదవండి:
విద్యుత్‌ రంగం బలోపేతం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

మరిన్ని వార్తలు