ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

14 Aug, 2020 14:01 IST|Sakshi

సాక్షి, అమ‌రావ‌తి :  క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్‌ల‌తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నూత‌న హాస్పిట‌ల్ ద్వారా ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు వైఎస్ జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి. తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు