'గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తాం'

9 Aug, 2020 14:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని గిరిజనులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడతాన్నారు.


 

మరిన్ని వార్తలు