నేడు మహానేత జయంతి

8 Jul, 2021 05:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించటంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం, ద్విచక్ర వాహనాలు, నిత్యావసర సరుకుల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఫొటోల ప్రదర్శన, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు