ఆంధ్రజ్యోతి కథనం నీతిమాలిన చర్య: వైఎస్‌ షర్మిల

26 Jan, 2021 14:09 IST|Sakshi

వైఎస్సార్‌ కుటుంబంపై తప్పుడు కథనం రాసిన వారిపై న్యాయపరమైన చర్యలు 

వైఎస్‌ షర్మిల వెల్లడి

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశ పూర్వకంగా రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఆదివారం పతాక శీర్షికగా వచ్చిన కథనం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని ఆమె సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ పత్రిక అయినా, చానల్‌ అయినా, ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పని షర్మిల స్పష్టం చేశారు. అది నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని ఆమె తేల్చి చెప్పారు.  

మరిన్ని వార్తలు