నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్‌ విజయమ్మ

10 Aug, 2022 13:28 IST|Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా: కదిరికి చెందిన ఏపీపీఎస్సీ సభ్యులు జీవీ సుధాకర్‌రెడ్డి కుమార్తె లక్ష్మి సైనా, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వీర ప్రతాప్‌రెడ్డి కుమారుడు వీర శివారెడ్డి వివాహ రిసెప్షన్‌ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.  

చదవండి: (ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌)

మరిన్ని వార్తలు