నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ విజయమ్మ  

8 Dec, 2022 21:14 IST|Sakshi

పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె హేమలత వివాహం గంగాధరతో ఈనెల 3వ తేదీన పులివెందులలో జరిగింది.

బుధవారం నూతన వధూవరులను భాకరాపురంలోని ముఖ్యమంత్రి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ ఆశీర్వదించారు. కార్యక్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ యాదవ్, కుమారుడు రామలింగేశ్వర, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఆహా ఏమి రుచి.. తిన్నారు మైమరచి    

మరిన్ని వార్తలు