బాబాజీరావుకు వైఎస్‌ విజయమ్మ పరామర్శ 

30 Dec, 2021 06:27 IST|Sakshi
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జొన్నకూటి బాబాజీరావును పరామర్శిస్తున్న వైఎస్‌ విజయమ్మ. చిత్రంలో మంత్రి వనిత  

సాక్షి, దేవరపల్లి/కొవ్వూరు: గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావును వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ హైదరాబాద్‌లోని సీటీ న్యూరో ఆసుపత్రిలో బుధవారం పరామర్శించారు. బాబాజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాబాజీరావు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకుని, ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాబాజీరావు ఆరోగ్యం మెరుగుపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

మరిన్ని వార్తలు