చిల్లకూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, నవ్యాంధ్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రులుగా చేయడంలో వైఎస్ విజయమ్మ కీలకంగా వ్యవహరించారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్కుమార్ ప్రశంసించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె సైకత శిల్పాన్ని రూపొందించానని ఆయన చెప్పారు.