సాక్షి, వైఎస్సార్ కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్యాదవ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం గోవాలోని స్థానిక కోర్టులో సునీల్ యాదవ్ను సీబీఐ హాజరుపరిచింది. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్పై మంగళవారం సాయంత్రంలోపు కడప చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా రేపు(బుధవారం) కడప కోర్టులో సీబీఐ సునీల్యాదవ్ను హాజరుపర్చనుంది.