వైఎస్సార్‌ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు

8 Jul, 2021 14:11 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్‌ ఆశయాలను అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం బాల సహయోగ్‌లో జరిగిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వైఎస్సార్‌ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్‌ పాలన చేశారు.
వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

కాగా, ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌లు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతించారు.

మరిన్ని వార్తలు