రేపు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ

28 Feb, 2021 22:15 IST|Sakshi

అమరావతి: సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా..వారికోసం రూ.1478.83 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయనుంది. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. అంతేగాక లబ్ధిదారులకు ఆర్‌బీఐఎస్‌ ద్వారా ఫేషియల్‌ అథెన్టికేషన్‌ నిర్వహించనున్నారు.


 

మరిన్ని వార్తలు