వైఎస్సార్‌ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ

17 Oct, 2022 20:51 IST|Sakshi

సీఎం జగన్‌ ఆళ్లగడ్డ పర్యటన.. అప్‌డేట్స్‌

12:49PM

రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల  ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్‌
50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు విడుదల చేసిన సీఎం జగన్‌


12:11PM

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు

  • రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
  • ప్రతి అంశంలో రైతులకు అండగా ఉంటున్నాం
  • ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నాం
  • రైతులకు ఇంత తోడుగా ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు
  • క్యాలెండర్‌ ప్రకారం ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నాం
  • రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది
  • 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది
  • రైతన్నత ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం
  • మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ. 13,500 సాయం అందిస్తున్నాం
  • ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష లేదు
  • ఇప్పటికే మేలో రూ. 7500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4 వేలు ఇస్తున్నాం
  • మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ.25, 971 కోట్ల మేర లబ్థి
  • మొత్తం 50 లక్షల మంది ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశాం
  • ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకూ రూ. 51 వేలు అందించాం
  • పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం
  • మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • మూడున్నరేళ్లలో రైతన్నల కోసం రూ. 1.33లక్షల కోట్లు ఖర్చు చేశాం
  • మంచి పనులు ఎల్లో మీడియాలో రావు
  • ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది
  • ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి
  • గతంలో డీపీటీ పథకం.. దోచుకో, పంచుకో, తినుకో
  • ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్‌ బెనఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ అమలవుతోంది
  • గజదొంగల ముఠా మంచిని చెప్పదు.. కుట్రలే చేస్తుంది
  • అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి
  • చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి
  • అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది
  • ఈరోజు మీ జీవితాలు బాగున్నాయా.. లేదా అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి

  • రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు
  • ఈ ప్రభుత్వంతో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు
  • సున్నా వడ్డీ కింద చంద్రబాబు రూ. 685 కోట్లు చెల్లిస్తే,   మూడున్నరేళ్లల్లో సున్నా వడ్డీ కింద రూ. 1,282 కోట్లు చెల్లించాం
  • బాబు హయాంలో బ్యాంకుల ద్వారా రూ. 3.6 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు రూ. 5.48 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం
  • 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,684 కోట్లె బీమా సొమ్ము జమ చేశాం
  • ఏ రైతు నష్టపోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం
  • దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి
  • భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి

11:53AM

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రసంగిస్తూ..

  • సీఎం జగన్‌ రైతులకు అండగా నిలిచారు
  • క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నారు.
  • దేశంలోనే లేని విధంగా వైఎస్సార్‌ ఉచిత పంటల భీమా
  • రైతులతో వ్యవసాయం సలహా మండలి ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏపీ
  • టీడీపీ హయాంలో రైతుల పేరిట దోచుకున్నారు
  • మేం వచ్చాక దళారుల ప్రమేయం లేకుండా రైతులకు రాయితీ
  • ఏపీ వ్యవసాయం రంగం చర్యలను ఆస్ట్రేలియా ప్రతినిధులు ప్రశంసించారు
  • ప్రపంచంలోనే లేని వ్యవసాయ సంస్కరణలు ఏపీలో ఉన్నాయని వారు కొనియాడారు
     

11: 20AM
ఆళ్లగడ్డ చేరుకున్న సీఎం జగన్‌

10:10AM
► 
వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నగదు జమ కార్యక్రమం.. కాసేపట్లో ఆళ్లగడ్డకు చేరుకోనున్న సీఎం జగన్‌.

9:03AM

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండవ విడుత నగదు జమ కార్యక్రమం కోసం..  తాడేపల్లి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరారు సీఎం జగన్‌.

► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడతను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో ప్రసంగించి.. అనంతరం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.

 వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు. 

► వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం అందజేస్తున్నారు. 

► మే నెలలో ఖరీఫ్‌కు ముందే తొలి విడత సాయాన్ని అందజేసింది.

► మూడో విడుతను సంక్రాంతి సమయంలో విడుదల చేయనుంది.

 తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే.. ఇప్పటివరకు ఒక్క వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర ఏపీ రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు