ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్

18 Jan, 2021 15:53 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు. ఆమె వెంట  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంతకుముందుసీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సునీత ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


 

మరిన్ని వార్తలు