గ్రామాల్లో మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపణ

15 Feb, 2021 21:55 IST|Sakshi

ఎన్నికల‌ సంఘం కార్యదర్సి కన్నబాబుకు ఫిర్యాదు

విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా విజయవాడలో ఎన్నికల‌ సంఘం కార్యదర్శి కన్నబాబును సోమవారం వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందాపురం, వెల్లంక పంచాయతీలలో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతూ ప్రలోభాలకు టీడీపీ మద్దతుదారులు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తున్న తెలుగు దేశం పార్టీ మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరారు. చిత్తూరు జిల్లా తిమ్మాపురం వడ్డేపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలపై టీడీపీ చేసిన దాడులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు