సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం

6 Aug, 2020 04:35 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌కు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి, పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రూ.కోటి విరాళం ఇచ్చారు. బుధవారం విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, అన్నె చిట్టిబాబు, రాజులపాటి రామచంద్రరావు, దోనేపూడి కిరణ్, హనుమంతరావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు