‘చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు.. పవన్‌కు నైతిక విలువలు లేవు’

19 Oct, 2022 13:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నేతలు ఫైరవుతున్నారు. 

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి 
పవన్‌ కల్యాణ్‌ తండ్రి పరువు తీశాడు. చిరంజీవి గౌరవాన్ని మంటలో కలిపాడు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్‌ మాట్లాడాడు. రాజకీయాలకు పవన్‌ కల్యాణ్‌ పనికిరాడు.

► మల్లాది విష్ణు..
పవన్‌కు సిద్ధాంతం, నైతిక విలువలు లేవు. ప్రజాప్రతినిధులను దుర్బాషలాడటం సరికాదు. చంద్రబాబు చేతిలో పవన్‌ కీలుబొమ్మ. 

► కిలారి రోశయ్య.. 
పవన్‌ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. కాపులకు పవన్‌ చేసింది శూన్యం. దిశ, దశ లేని పార్టీగా జనసేన మిగిలిపోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి పవన్‌. 

► అంబటి రాంబాబు.. 
జనసైనికులా? బాబు బానిసలా. యుద్ధానికి సిద్ధం అన్నావ్‌.. చంద్రబాబు సంకెక్కావ్‌. పిరికోళ్లందరూ కలిసే రండి చూసుకుందాం. 

మరిన్ని వార్తలు