‘కుట్రలకు పాల్పడితే.. తప్పించుకోలేరు’

5 Jan, 2021 21:52 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాల్లో ఏవైనా లోపాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన విపక్షం.. అటువంటివేవీ కనిపించక గుళ్లు, విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా విపక్షం తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘‘కొట్లాటలు పెట్టడం మాని.. మంచి పనులకు సూచనలిస్తే సీఎం స్వీకరిస్తారు. కుట్రలకు పాల్పడితే తప్పించుకోలేరు.. చట్టం వదిలిపెట్టదని’’ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.(చదవండి: సీఎం జగన్‌ పాలనపై యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రశంసలు)

మరిన్ని వార్తలు