MP Vijayasai Reddy: ప్రధాని మోదీతో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ.. ఏపీ అంశాలపై చర్చ

24 Mar, 2022 16:18 IST|Sakshi

YSRCP MP Meets PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారాయన. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. 

అంతేకాదు దేశ చరిత్రలో తొలిసారిగా మన విద్యా రంగానికి బడ్జెట్ గ్రాంట్ రూ. 1 లక్ష కోట్లు వచ్చిందని,  దీని అర్థం దేశంలో చాలా కాలంగా ఉన్న మౌలిక సదుపాయాలు, విద్య యొక్క నాణ్యతను పెంచడమే అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌ ద్వారా తెలిపారు.

మరిన్ని వార్తలు