సాక్షి అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరవుతారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఒత్తిడి పెంచడం, కృష్ణా జలాల వివాదం.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.