జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం

27 Jul, 2022 17:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం) ఎన్నిక బుధవారం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో 9 నామినేషన్లు వేసి టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీ స్టాండింగ్‌ కమిటీ అభ్యర్థికి అదనపు ఓట్లు వచ్చాయి.
చదవండి: కేంద్రంతో కుస్తీ పడుతున్నాం.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు