అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య

6 Mar, 2023 00:42 IST|Sakshi
పెంచలమ్మ మృతదేహం

పెనగలూరు : మండలంలోని కంబాలకుంట హరిజనవాడకు చెందిన గానుగపెంట పెంచలమ్మ (65) అనే వృద్దురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్‌ఐ మల్లికార్జున కథనం మేరకు పెంచలమ్మ అనారోగ్య సమస్యలతో ఈనెల 4వ తేదీ రాత్రి బెస్తపల్లి సమీపంలోని రహదారిలో విషద్రావణం తాగి కంపచెట్ల మధ్యలో పడి ఉంది. పెంచలమ్మ కుమార్తె సుబ్బమ్మకు సమాచారం అందించారు.వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

కడుపునొప్పి తాళలేక..

లక్కిరెడ్డిపల్లి: మండలంలోని దిన్నెపాడు పంచాయతీలోని దిన్నెమీద పల్లికి చెందిన మేఘన (19) అనే వివాహిత ఆదివారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ వినోద్‌ కుమార్‌ కథనం మేరకు మేఘనకు ఇటీవలే వివాహం జరిగింది. తరచూ కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. ఆదివారం నొప్పి ఎక్కువగా రావడంతో తట్టుకోలేక విషద్రావణం తాగింది. వెంటనే ఆమెను తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు