వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యయత్నం

9 Mar, 2023 04:10 IST|Sakshi

మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వివాహితలు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వివరాలు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు క్రాస్‌కు చెందిన ఇమామ్‌సాహెబ్‌ భార్య ముబీనా (20) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. భర్త ఏడాదికిత్రం జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. మంగళవారం రాత్రి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ మందలించాడు. దీంతో ముబీనా ఇంట్లో ఉన్న హార్పిక్‌ తాగింది. పీటీఎం మండలం బెట్టకొండకు చెందిన కదిరేపతి భార్య రాధమ్మ(35) కుటుంబ సమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు వీరిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు