ఉరి వేసుకొని ఆర్టీపీపీ ఏడీ ఆత్మహత్య

22 Mar, 2023 02:04 IST|Sakshi

ఎర్రగుంట్ల : రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లోని కోల్‌ప్లాంట్‌లో ఏడీగా పని చేస్తున్న హుస్సేన్‌ సాహెబ్‌(53) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హుస్సేన్‌ సాహెబ్‌కు ఇటీవల ఏఈ నుంచి ఏడీగా పదోన్నతి లభించింది. ఆర్టీపీపీలోని ఈ–టైపు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. అనారోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యతోపాటు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ విషయంపై కలమల్ల ఎస్‌ఐ శివప్రసాద్‌ను వివరణ కోరగా.. ‘ఏడీ హుస్సేన్‌ సాహెబ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. అయితే ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తాం’ అని ఎస్‌ఐ చెప్పారు.

హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శాస్త్రినగర్‌కు చెందిన మునికుమార్‌పై మూడు రోజుల క్రితం అజీజ్‌ కత్తితో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాను ఇంటిలో వుండగా అజీజ్‌, తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండగా చూశానని, తన ఇంటిపైకి వచ్చి ఘర్షణ పడి కత్తితో దాడి చేసి, గాయపరిచాడని మునికుమార్‌ తెలియజేశాడు. ఈ మేరకు అజీజ్‌తోపాటు అతని తల్లి ఫాతిమా, సోదరుడు ఇంతియాజ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురిని మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉలసయ్య తెలియజేశారు.

>
మరిన్ని వార్తలు