సిద్దవటం : మండలంలోని జంగాలపల్లె గ్రామ శివారులో మంగళవారం ఆటోను టిప్పర్ ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం జంగాలపల్లె గ్రామం నుంచి కూలి పనులకు బెటాలియన్ వద్దకు వెళ్లేందుకు కొందరు మంగళవారం ఆకురోపల్లె గ్రామానికి చెందిన ఓబులేస్ ఆటోలో వెళ్తున్నారు. ఆటో జంగాలపల్లె గ్రామం దాటగానే.. ఎదురుగా ఇసుక క్వారీలోకి వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్షమమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓబులమ్మ, అమ్ములు, సుజాతకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాఽధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ సుద్దపల్లె రామాపురానికి చెందిన ప్రవీణ్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
నలుగురికి గాయాలు