రాయచోటి: ఏడాదంతా జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్ గిరీషా పీఎస్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు శోభకృత్ నామ ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే జేసీ తమీమ్ అన్సారియా, ప్రభుత్వవిప్, శాసనసభ వ్యవహారాల సమన్వయ కర్త, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ప్రభుత్వవిప్, రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, నవాజ్బాష జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.