ఓబులవారిపల్లె: బోటుమీదపల్లిలో వీఆర్ఏగా పనిచేస్తున్న పెంచలయ్య (45) ప్రమాదవశాత్తు జారిపడటంతో బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఉగాది పండుగను పురస్కరించుకొని పెంచలయ్య సమీపంలోని గంగమ్మ గుడివద్ద పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు జారి వెనక్కు పడటంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య ఇంద్రమ్మ, కుమార్తె కలరు.