నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

22 Mar, 2023 02:28 IST|Sakshi
స్వామీజీ ఆశీస్సులు పొందుతున్న ఎమ్మెల్యే శివకుమార్‌

తెనాలి రూరల్‌: తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యపురంలోని మహావిద్యా పీఠంలో గల అభయ హస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో వసంత నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి త్రికాల పీఠార్చనలు, విశేష పూజ, హోమాలు, వేద సభలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం నుంచి ఏప్రిల్‌ 4వరకు సుబ్రహ్మణ్యపురంలోనే ఉండి ప్రతి రోజు భక్తులకు స్వామీజీ అనుగ్రహ భాషణ చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు పొందారు.

మరిన్ని వార్తలు