కేజీబీవీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

24 Mar, 2023 06:18 IST|Sakshi

బాపట్లఅర్బన్‌: జిల్లాలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యా శాఖ అధికారి, ఎక్స్‌ అఫిషియో ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ పి.వి.జె.రామారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉన్న నాలుగు కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 27 నుంచి ఏప్రిల్‌ 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అనాధలు, బడిబయట పిల్లలు, బడిమానేసిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్‌ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్‌ కోసం పరిగణిస్తామన్నారు. దరఖాస్తును హెచ్‌టీటీపీఎస్‌://ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌:// సైట్‌ ద్వారా పొందవచ్చు అన్నారు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్‌ మేసేజ్‌ ద్వారా సమాచారం అందుతోందన్నారు. సంబంధిత విద్యాలయం నోటిఫికేషన్‌ బోర్డులో నేరుగా చూడవచ్చన్నారు. ఇతర వివరాలకు 9502877357 నంబరులో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు