కొత్త బజాజ్‌ ప్లాటినా బైక్‌ : ధర ఎంతంటే?

5 Mar, 2021 11:50 IST|Sakshi

 బజాజ్‌ 110 ఏబీఎస్‌ ధరరూ. 65,920 

సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ ఆటో గురువారం దేశీయ మార్కెట్లోకి కొత్త బజాజ్‌ ప్లాటినా 110 ఏబీఎస్‌ బైక్‌ను విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ధర రూ.65,920 గా నిర్ణయించింది. ‘స్ప్రింగ్‌-ఆన్‌-స్ప్రింగ్‌’ నిట్రాక్స్‌ సస్పెన్షన్, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఫీచర్లను కలిగిన ఈ బైక్‌లో ట్యూబ్‌లెస్‌ టైర్లను అమర్చారు. (టియాగో.. కొత్త వేరియంట్‌)

బ్రేకింగ్‌ సెగ్మెంట్‌లో అత్యుత్తమ టెక్నాలజీని కలిగిన  తమ కొత్త ప్లాటినా 110 లక్షలాది మంది భారతీయులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తుందని కంపెనీ మోటార్‌సైకిల్‌ విభాగం అధ్యక్షుడు సరంగ్‌ కనడే తెలిపారు. దేశవ్యాప్తంగా 7 మిలియన్ల మంది కస్టమర్ల అభిమాన్ని సొంతం చేసుకున్న ప్లాటినా బ్రాండ్‌ ఇప్పుడు ఏబీఎస్‌ చేరికతో తన పోటీదారుల కంటే మరింత ముందుకు దూసుకెళ్లిందని కనేడే తెలిపారు.  (అత్యంత తక్కువ ధర: బజాజ్‌ ప్లాటినా 100 ఈఎస్‌)

మరిన్ని వార్తలు