ఎయిర్‌ఏషియా చీఫ్‌గా అలోక్‌ సింగ్‌

23 Dec, 2022 13:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాలో కాస్ట్‌ ఎయిర్‌లైన్‌ (ఎల్‌సీసీ) సీఈవోగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈవో అలోక్‌ సింగ్‌ జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎయిర్‌ ఇండియా ఎల్‌సీసీలో ఎయిర్‌ఏషియా ఇండియాతోపాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి.

ఏయిర్‌ఏషియా ఇండియా ప్రస్తుత సీఈవో సునీల్‌ భాస్కరన్‌ ఇక నుంచి ఏవియేషన్‌ ట్రైనింగ్‌ అకాడమీకి నాయకత్వం వహిస్తారు. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏయిర్‌ఏషియా ఇండియా, విస్తారా కంపెనీలు టాటా గ్రూప్‌లో భాగం.   

మరిన్ని వార్తలు